హైదరాబాద్: రూ.50కోట్ల భూవివాదం కేసులో కొత్త కోణాలు
ABN , First Publish Date - 2020-08-14T15:11:53+05:30 IST
నగరంలోని బంజారాహిల్స్లో రూ.50 కోట్ల భూవివాదం కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి.
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో రూ.50 కోట్ల భూవివాదం కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. తప్పుడు పత్రాలతో ఖలీద్ న్యాయ స్థానాన్ని, ఏసీబీని తప్పుదోవ పట్టించినట్లు విచారణలో వెల్లడైంది. కేసులో ఖలీద్ నుంచి పత్రాల కోసం లంచం తీసుకుంటుండగా ఎమ్మార్వో, ఆర్ఐ, బంజారాహిల్స్ ఎస్ఐ... ఏసీబీకి పట్టుబడ్డారు. ఇప్పటికే ఖలీద్తో పాటు అతడికి సహకరించిన అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.