గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి

ABN , First Publish Date - 2020-02-28T13:09:08+05:30 IST

గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి

గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి

హైదరాబాద్: నగరంలోని హబీబ్‌నగర్‌ పరిధిలోని మన్‌గిరి బస్తీలో విషాదం నెలకొంది. ఇంటి గోడకూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గీత అనే మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు మృతులు రోషిని(6), పావని(4), సారిక(4నెలలు)గా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


Updated Date - 2020-02-28T13:09:08+05:30 IST