కోహ్లీ కోసం గెలవండి!
ABN , First Publish Date - 2021-10-18T08:04:14+05:30 IST
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు. టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్ కెప్టెన్సీకి కూడా అతను వీడ్కోలు చెప్పనున్నాడు.
రైనా సూచన
దుబాయ్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు. టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్ కెప్టెన్సీకి కూడా అతను వీడ్కోలు చెప్పనున్నాడు. అందుకే కోహ్లీ కోసమైనా ఈసారి పొట్టి ప్రపంచక్పను గెలవాలని టీమిండియా క్రికెటర్లకు సురేశ్ రైనా సూచించాడు. ‘ఈ మెగా ఈవెంట్ సందర్భంగా మన ఆటగాళ్లకు నేనిచ్చే సందేశం ఒక్కటే. కోహ్లీ కోసం కప్ గెలవండి. ఎందుకంటే కెప్టెన్గా అతడికిదే చివరి టీ20 టోర్నీ. అటు భారత అభిమానులు కూడా దీనికోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మన స్థాయికి తగ్గట్టు ఆడితే విజేతగా నిలవడం సాధ్యమే’ అని రైనా పేర్కొన్నాడు.