‘ఇచ్చ‌ట‌ వాహ‌న‌ములు నిలుప‌రాదు’ రిలీజ్ డేట్ ఫిక్స్

ABN , First Publish Date - 2021-08-14T01:48:07+05:30 IST

సుశాంత్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల గుండ్ల నిర్మించిన చిత్రం

‘ఇచ్చ‌ట‌ వాహ‌న‌ములు నిలుప‌రాదు’ రిలీజ్ డేట్ ఫిక్స్

సుశాంత్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల గుండ్ల నిర్మించిన చిత్రం ‘ఇచ్చ‌ట‌ వాహ‌న‌ములు నిలుప‌రాదు’. నిజ ఘటనల ఆధారంగా హిలేరియ‌స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 27న థియేట‌ర్స్‌లో విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.


‘‘ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన ‘ఇచ్చ‌ట‌ వాహ‌న‌ములు నిలుప‌రాదు’ చిత్రాన్ని ఆగ‌స్ట్ 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. కోవిడ్ ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో విడుద‌లైన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌క్సెస్ అయ్యాయి. అదే విధంగా, సెకండ్ వేవ్ త‌ర్వాత ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కు వ‌చ్చి సినిమాల‌ను స‌క్సెస్ చేస్తున్నారు. వైవిధ్య‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తుంటారు. ఇప్పుడు వైవిధ్య‌మైన‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఇచ్చ‌ట‌ వాహ‌న‌ములు నిలుప‌రాదు’ చిత్రాన్ని తెలుగు ఆడియెన్స్ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని నమ్ముతున్నాము’’ అని నిర్మాతలు ప్రకటించారు.

Updated Date - 2021-08-14T01:48:07+05:30 IST