ఇలా చేసుకోనిపక్షంలో... పాన్ కార్డు చెల్లుబాటు కాదు...
ABN , First Publish Date - 2021-03-09T20:21:38+05:30 IST
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అమల్లోకి రాబోతున్న నేపధ్యంో... ఆరోజు నుంచి పలు అంశాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ క్రమంలో... ఈ నెలఖరులోగా కొన్ని పనులు కచ్చితంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరముంది. వివరాలివీ...
ముంబై : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అమల్లోకి రాబోతున్న నేపధ్యంో... ఆరోజు నుంచి పలు అంశాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ క్రమంలో... ఈ నెలఖరులోగా కొన్ని పనులు కచ్చితంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరముంది. వివరాలివీ...
* ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనమైన నేపధ్యంలో పాత ఐఎఫ్ఎస్ కోడ్లు ఏప్రిల్ నుంచి పని చేయవు. ఈ క్రమంలో... మార్చి 31లోపు కొత్త కోడ్స్ తెలుసుకోవాలి. అలాగే పాత చెక్కులు కూడా చెల్లవు. కొత్తవి తీసుకోవాల్సి ఉంటుంది.
* కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. కాగా... ఇంకా ఈ కార్డు తీసుకోకపోతే సమీపంలోని బ్యాంక్కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. పదిహేను రోజుల్లోగా కార్డు అందుతుంది.
* పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ కల్పిస్తోన్న వివాద్ సే విశ్వాస్ పథకం మార్చి చివరి వరకే అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో... పన్ను బకాయిలుంటే ఒకేసారి సెటిల్ చేసుకోవచ్చు.
* దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టే్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కోటక్ మహీంద్రా బ్యాంక్ వరకు పలు బ్యాంకులు చౌక వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే... ఈ వెసులుబాటు మార్చి చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
బ్యాంకులు సీనియర్ సిటిజన్స్కు అధిక వడ్డీ ప్రయోజనాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి ఈ వెసులుబాటునందిస్తున్నాయి.
* 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీ రిటర్న్స్ దాఖలుకు మార్చి 31 వరకే గడువు ఉంది. ఈలోపు రిటర్న్స్ దాఖలు చేయాలి.
* పాన్ కార్డు ఉన్నవారు ఆధార్ కార్డుతో పాన్ నెంబర్ను లింక్ చేసుకోవడానికి మార్చి 31 వ తేదీతో గడువు ముగియనుంది. ఈలోపు రెండింటినీ లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లుబాటు కాకపోవచ్చని సమాచారం.