ఇంగ్లండ్‌తో టెస్టులు డ్రా చేసుకున్నా.. గెలిచినట్లే: అఫ్రిదీ

ABN , First Publish Date - 2020-08-04T04:31:03+05:30 IST

ఇంగ్లండ్‌తో పాక్ జట్టు మూడు టెస్టుల సిరీస్‌పై పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ మాట్లాడాడు.

ఇంగ్లండ్‌తో టెస్టులు డ్రా చేసుకున్నా.. గెలిచినట్లే: అఫ్రిదీ

ఇస్లామాబాద్: ఇంగ్లండ్‌తో పాక్ జట్టు మూడు టెస్టుల సిరీస్‌పై పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ మాట్లాడాడు. ఈ సిరీస్‌ను పాక్ జట్టు డ్రా చేసుకోగలిగినా చాలని, అలా చేస్తే పాక్ జట్టు సిరీస్ గెలిచినట్లేనని అఫ్రిదీ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్‌లో టెస్టులు ఆడటం చాలా కష్టంగా ఉంటుందన్న అఫ్రిదీ.. అలాంటి పరిస్థితుల్లో సిరీస్‌ను డ్రా చేసుకోవడమూ గొప్పేనని, అది గెలుపుతో సమానమే అని చెప్పాడు. అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పాక్ జట్టు సారధి బాబర్ ఆజమ్ గురించి కూడా మాట్లాడాడు. రానున్న రోజుల్లో బాబర్ ఒంటిచేత్తో మ్యాచులు గెలిపించగలడని తేల్చిచెప్పాడు.

Updated Date - 2020-08-04T04:31:03+05:30 IST