విశాఖ స్టీల్ ప్లాంట్‌ కోసం కొనసాగుతున్న దీక్షలు

ABN , First Publish Date - 2021-04-13T20:54:07+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయొద్దని అఖిలపక్ష కార్మికసంఘాలు జీవీఎమ్సీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్ష..

విశాఖ స్టీల్ ప్లాంట్‌  కోసం కొనసాగుతున్న దీక్షలు

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయొద్దని అఖిలపక్ష కార్మిక సంఘాలు జీవీఎమ్సీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు 12వ రోజుకు చేరాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు వారు పోరాటం కొనసాగిస్తున్నారు. దీక్ష సేవ్ స్టీల్ ప్లాంట్, సేవ్ పబ్లిక్ సెక్టార్ నినాదాలతో శిబిరం హోరెత్తిపోతుంది. కాగా దీక్ష చేస్తోన్న అఖిలపక్ష కార్మిక సంఘాలకు ఆశా వర్కర్స్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ‌ను విరమించుకోవాలని ఆశా వర్కర్స్ డిమాండ్ చేశారు. కేంద్రం వెంటనే ఈనిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆశావర్కర్స్ హెచ్చరించారు.

Updated Date - 2021-04-13T20:54:07+05:30 IST