భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లండ్ విలవిల.. 112 ఆలౌట్

ABN , First Publish Date - 2021-02-24T23:53:29+05:30 IST

మొతేరా వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్ల ధాటికి పర్యాటక జట్టు పూర్తిగా తేలి పోయింది.

భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లండ్ విలవిల.. 112 ఆలౌట్

అహ్మదాబాద్‌: మొతేరా వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్ల ధాటికి పర్యాటక జట్టు పూర్తిగా తేలి పోయింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లను తమ స్పిన్ మాయజాలంతో బెంబెలేత్తించారు. ఈ ఇద్దరి బౌలింగ్‌లో ఆడటాన్ని తడబడిన ఇంగ్లండ్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు. 


ముఖ్యంగా అక్షర్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆరు వికెట్లతో చెలరేగాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జాక్ క్రాలీ(53) అర్థశతకం మినహా.. మిగతా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలం అయ్యారు. భీకరమైన్ ఫామ్‌లో ఉన్న ఆ జట్టు సారథి జో రూట్(17) కూడా నిరాశపరిచాడు. భారత బౌలర్లలో అక్షర్ 6 వికెట్లు తిస్తే.. అశ్విన్ 3, ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టారు.    

Updated Date - 2021-02-24T23:53:29+05:30 IST