ఒకే ఏడాది రెండు టెస్టులు!

ABN , First Publish Date - 2021-05-19T08:21:16+05:30 IST

భారత మహిళల క్రికెట్‌ జట్టు 15 ఏళ్ల తర్వాత ఒకే ఏడాది రెండు టెస్టులు ఆడబోతోంది. జూన్‌ 16న మిథాలీ రాజ్‌ బృందం ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడనుండగా.. సెప్టెంబరులో జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు...

ఒకే ఏడాది రెండు టెస్టులు!

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు 15 ఏళ్ల తర్వాత ఒకే ఏడాది రెండు టెస్టులు ఆడబోతోంది. జూన్‌ 16న మిథాలీ రాజ్‌ బృందం ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడనుండగా.. సెప్టెంబరులో జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఇక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లతో పాటు మరో టెస్టును కూడా ఆడించే అవకాశం ఉంది. కాగా, క్రికెట్‌ ఆస్ట్రేలియా, బీసీసీఐ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది. 2014లో చివరిసారిగా ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో భారత మహిళల జట్టు రెండు టెస్టులు ఆడింది. 2006లో ఆఖరిసారిగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఓవరాల్‌గా భారత మహిళల జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడక ఇప్పటికి ఏడేళ్లవుతుంది. 


Updated Date - 2021-05-19T08:21:16+05:30 IST