కువైట్లోని భారతీయ ఇంజనీర్లకు ఎంబసీ కీలక సూచన
ABN , First Publish Date - 2020-09-21T13:20:57+05:30 IST
కువైట్లోని భారతీయ ఇంజనీర్లకు అక్కడి భారత దౌత్యకార్యాలయం కీలక సూచన చేసింది.
కువైట్ సిటీ: కువైట్లోని భారతీయ ఇంజనీర్లకు అక్కడి భారత దౌత్యకార్యాలయం కీలక సూచన చేసింది. ప్రస్తుతం ఎంబసీ నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ డ్రైవ్లో భాగంగా అక్రిడేషన్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లతో పాటు మిగతా ఇంజనీర్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. గత వారం భారత ఎంబసీ ఇండియన్ ఇంజనీర్ల కోసం ఈ రిజిస్ట్రేషన్ డ్రైవ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో https://forms.gle/YRoQwFEu3YHURgCe6 లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ సెప్టెంబర్ 30గా ఎంబసీ పేర్కొంది. కనుక భారతీయ ఇంజనీర్స్ వీలైనంత త్వరగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని భారత దౌత్యకార్యాలయం ఆదివారం మరోసారి గుర్తు చేసింది.