భారత రెజ్లర్లకు నిరాశ

ABN , First Publish Date - 2021-04-10T09:14:27+05:30 IST

భారత గ్రీకో రోమన్‌ రెజ్లర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. ఆసియా క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారీ అంచనాలున్న సునీల్‌ కుమార్‌తో పాటు మరో నలుగురు రెజ్లర్లు సెమీ్‌సలోనే ఓడారు.

భారత రెజ్లర్లకు నిరాశ

ఆల్మటి: భారత గ్రీకో రోమన్‌ రెజ్లర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. ఆసియా క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారీ అంచనాలున్న సునీల్‌ కుమార్‌తో పాటు మరో నలుగురు రెజ్లర్లు సెమీ్‌సలోనే ఓడారు. మరో రెజ్లర్‌ రవి (97 కి) క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. ఈ టోర్నీలో ఫైనల్‌ చేరితే ‘టోక్యో’ బెర్త్‌ దక్కేది. కానీ, పురుషుల 87 కేజీల సెమీ్‌సలో సునీల్‌.. కజక్‌ రెజ్లర్‌ నూర్‌సుల్తాన్‌ తుర్సినోవ్‌ చేతిలో ఓడాడు. ఇతర సెమీస్‌ బౌట్స్‌లో జ్ఞానేంద్ర (60 కేజీలు), అషు (67), గుర్‌ప్రీత్‌ సింగ్‌ (77), నవీన్‌ (130) ఓడారు. అయితే.. అషు, గురుప్రీత్‌ కాంస్య పతక పోరులో గెలిచి మెడల్స్‌ అందుకున్నారు.  

Updated Date - 2021-04-10T09:14:27+05:30 IST