Tokyo Olympics: సెమీస్కు చేరిన టీమిండియా
ABN , First Publish Date - 2021-08-02T00:32:52+05:30 IST
ఒలింపిక్స్లో భాగంగా జరుగుతున్న పురుషుల హాకీలో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది
టోక్యో: టోక్యో: ఒలింపిక్స్లో భాగంగా జరుగుతున్న పురుషుల హాకీలో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. క్వార్టర్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్తో జరిగిన పోరులో మన్ప్రీత్ సేన 3-1 తేడాతో విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. ఒలింపిక్స్లో భారత జట్టు సెమీస్కు వెళ్లడం 49 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 1972లో భారత జట్టు ఒలింపిక్ సెమీస్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టు క్వార్టర్స్ దాటలేదు. 1980 ఒలింపిక్స్లో భారత జట్టు స్వర్ణం సాధించినప్పటికీ ఆ ఎడిషన్లో సెమీ ఫైనల్ స్టేజ్ లేదు. కాగా, సెమీస్కు చేరిన భారత జట్టు ఈ నెల 3న బెల్జియంతో తలపడుతుంది.