Tokyo Olympics: హాకీలో జపాన్‌ను మట్టికరిపించిన భారత్

ABN , First Publish Date - 2021-07-30T22:22:59+05:30 IST

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా పూల్-ఎలో భాగంగా జపాన్‌తో జరిగిన

Tokyo Olympics: హాకీలో జపాన్‌ను మట్టికరిపించిన భారత్

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా పూల్-ఎలో భాగంగా జపాన్‌తో జరిగిన పోరులో 5-3తో విజయం సాధించింది. గుర్జంత్ సింగ్ రెండుసార్లు స్ట్రైక్ చేయడంతో భారత్ ఖాతాలో మరో విజయం వచ్చి పడింది. గుర్జంత్‌కు తోడు హర్మన్‌ప్రీత్ సింగ్, నీలకంఠశర్మ, సిమ్రజీత్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరచడంతో భారత జట్టు వరుసగా మరో విజయాన్ని అందుకుంది.


అర్జెంటీనాతో జరిగిన పోరులో 3-1తో విజయం సాధించిన భారత జట్టు నేడు కూడా అదే దూకుడు ప్రదర్శించింది. క్వార్టర్ ఫైనల్‌లో ఇప్పటికే బెర్త్ ఖరారు చేసుకున్న భారత జట్టు పూల్-ఎలో చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించింది. కాగా, పూల్-ఎలో ఆతిథ్య జపాన్ జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. తాజా విజయంతో పూల్‌-ఎలో భారత జట్టు రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా తొలి అగ్రస్థానంలో కొనసాగుతోంది.  

Updated Date - 2021-07-30T22:22:59+05:30 IST