Olympics Hockey: బ్రిటన్ చేతిలో ఓడిన ఐర్లాండ్.. క్వార్టర్స్‌కు భారత అమ్మాయిలు

ABN , First Publish Date - 2021-08-01T00:34:48+05:30 IST

ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. కాసేపటి క్రితం ఐర్లాండ్‌తో జరిగిన పూల్

Olympics Hockey: బ్రిటన్ చేతిలో ఓడిన ఐర్లాండ్.. క్వార్టర్స్‌కు భారత అమ్మాయిలు

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. కాసేపటి క్రితం ఐర్లాండ్‌తో జరిగిన పూల్ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్ 2-0 తేడాతో విజయం సాధించింది. ఫలితంగా భారత జట్టుకు క్వార్టర్స్ అవకాశాలు లభించాయి. ఉదయం దక్షిణాఫ్రికాతో జరిగిన పూల్-ఎ మ్యాచ్‌లో రాణీ రాంపాల్ సారథ్యంలోని మహిళల జట్టు 4-3తో విజయం సాధించినప్పటికీ క్వార్టర్స్‌ బెర్త్ పూర్తిగా ఖరారు కాలేదు. బ్రిటన్‌-ఐర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం భారత క్వార్టర్ అవకాశాలను నిర్ణయించే అవకాశం ఉండడంతో అందరూ ఆ మ్యాచ్ ఫలితం ఎదురుచూశారు. 


ఈ మ్యాచ్‌లో కనుక ఐర్లాండ్ గెలిచి ఉంటే భారత జట్టు స్వదేశానికి పయనం కావాల్సి వచ్చేది. అయితే, అందరూ ఊహించినట్టే ఐర్లాండ్‌పై గ్రేట్ బ్రిటన్ జట్టు తిరుగులేని విజయం సాధించడంతో భారత జట్టు క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఐర్లండ్ ఇంటికెళ్లింది. వరుస మ్యాచ్‌లు ఓడిన తర్వాత భారత అమ్మాయిలు తిరిగి ఫామ్‌లోకి వచ్చి వరుసగా రెండో విజయం అందుకున్నారు. క్వార్టర్ ఫైనల్‌లోనూ ఇదే జోరు కొనసాగిస్తే పతకం కోసం ఇండియా ఎదురుచూపులు ఫలిస్తాయి.

Updated Date - 2021-08-01T00:34:48+05:30 IST