చెక్ఇన్కు రూ.100 చార్జి చేస్తున్న ఇండిగో !
ABN , First Publish Date - 2020-10-18T13:10:43+05:30 IST
ఇండిగో విమానయాన సంస్థ విమానాశ్రయంలో చెక్ ఇన్ చేయాలనుకునే ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.100 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 17: ఇండిగో విమానయాన సంస్థ విమానాశ్రయంలో చెక్ ఇన్ చేయాలనుకునే ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.100 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. కొవిడ్ నేపథ్యంలో విమానయాన శాఖ ఐదు నెలల క్రితమే ప్రయాణికులకు వెబ్ చెక్ఇన్ తప్పనిసరి చేసింది. వెబ్ చెక్ఇన్ చేస్తే ఆన్లైన్లోనే బోర్డింగ్ పాస్ జారీ చేస్తారు. వెబ్ చెక్ఇన్ వద్దనుకునే వాళ్ల కోసం ఇండిగో తాజాగా శనివారం నుంచి విమానాశ్రయంలో రూ.100 రుసుముతో చెక్ ఇన్కు అవకాశం కల్పిస్తోంది.