పన్ను సంస్కరణలతో పారదర్శకత
ABN , First Publish Date - 2020-08-14T07:35:44+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించిన పన్ను సంస్కరణలను పా రిశ్రామిక సంఘాలతో పాటు నిపుణులు స్వాగతించారు. దీంతో పన్నుల మదింపులో పారదర్శకత, విశ్వసనీయత ఏర్పడతాయన్నారు...
- స్వాగతించిన పారిశ్రామిక దిగ్గజాలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించిన పన్ను సంస్కరణలను పా రిశ్రామిక సంఘాలతో పాటు నిపుణులు స్వాగతించారు. దీంతో పన్నుల మదింపులో పారదర్శకత, విశ్వసనీయత ఏర్పడతాయన్నారు. ఈ మార్పులతో నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి సాధికారిత ఏర్పడుతుందని పేర్కొన్నారు.
సంస్థాగత సంస్కరణల్లో ఇదో మైలు రాయి. ప్రభుత్వంపై పన్ను చెల్లింపుదారుల నమ్మకాన్ని ఇది ఎంతగానో పెంచుతుంది.
- సంగీతా రెడ్డి, ఫిక్కీ అధ్యక్షురాలు
ఫేస్లెస్ మదింపు, అప్పీళ్లతో వ్యక్తిగత పక్షపాతానికి తావుండదు. రిటర్న్ల పరిశీలన కూడా న్యాయంగా, పారదర్శకంగా జరుగుతాయి. దాంతో అనవసర వివాదాలు, దీర్ఘకాలిక కోర్టు కేసులూ తప్పుతాయి.
- హిమాన్షు పరేఖ్, కేపీఎంజీ ఇండియా
పన్నుల మదింపు లేదా అప్పీళ్లకు సంబంధించి ఫేస్లెస్ విధానం చాలా పెద్ద సంస్కరణ. పన్ను చెల్లింపుదారుల చార్టర్ కూడా మంచి పరిణామం. ఈ రెండు సంస్కరణలు పన్ను చెల్లింపుదారుకు ఎంతగానే మేలు చేస్తాయి.
- ఉదయ్ కోటక్, ప్రెసిడెంట్, సీఐఐ