ఇండ్సఇండ్ బ్యాంక్పై రూ.4.5 కోట్ల జరిమానా
ABN , First Publish Date - 2020-10-18T06:43:58+05:30 IST
హిందూజా గ్రూప్ సంస్థ ఇండ్సఇండ్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది.
ముంబై: హిందూజా గ్రూప్ సంస్థ ఇండ్సఇండ్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. పలు నిబంధనలు పాటించనందుకుగాను బ్యాంక్పై రూ.4.5 కోట్ల భారీ జరిమానా విధించింది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 47 ఏ(1) ప్రకారంగా ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ఈ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఆర్బీఐ గతంలోనే బ్యాంక్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
బ్యాంక్ స్పందనను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.