కరోనాపై పోరుకు ఇన్ఫోసిస్ 100 కోట్ల విరాళం
ABN , First Publish Date - 2021-05-11T05:54:59+05:30 IST
కరోనా కష్టకాలంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మరోసారి భారీ విరాళం ప్రకటించింది. కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా రూ.100 కోట్లు విరాళం ఇస్తున్నట్టు ఇన్ఫోసిస్...
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కరోనా కష్టకాలంలో ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మరోసారి భారీ విరాళం ప్రకటించింది. కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా రూ.100 కోట్లు విరాళం ఇస్తున్నట్టు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తి సోమవారం ప్రకటించారు. గతేడాది కొవిడ్ కాలంలోనూ ఇన్ఫోసి్సరూ.100 కోట్లు విరాళం ప్రటించింది. కాగా.. అప్పట్లో దాన్ని బెంగళూరు నగరానికే పరిమితం చేశారు. అయితే ఈసారి 100 కోట్ల రూపాయలను ఇతర నగరాల్లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఇతరత్రా ఔషధాల కొనుగోళ్లకు వినియోగించుకోవాలని సుధామూర్తి తెలిపారు.