జుడీషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-11-09T01:38:02+05:30 IST
ఏపీలో జుడీషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటుపై హైకోర్టులో
అమరావతి: ఏపీలో జుడీషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రివ్యూ కమిషన్ చట్ట విరుద్ధమని న్యాయవాది ప్రసాద్బాబు వాదించారు. న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తర్వాత ప్రివ్యూ కమిషన్కు నియమిస్తే అది జుడీషియల్ కాదన్న ప్రసాద్బాబు వాదించారు. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.