పరిషత్ ఎన్నికలపై ఎల్లుండి విచారణ: హైకోర్టు
ABN , First Publish Date - 2021-04-21T10:15:30+05:30 IST
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం (23న) విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది.
అమరావతి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం (23న) విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. మంగళవారం కోర్టు ప్రారంభమైన వెంటనే.. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తరఫు న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. పరిషత్ వ్యాజ్యాలపై విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసిందని.. అయితే కోర్టు ఆదేశాల మేరకు వ్యాజ్యాలు లిస్ట్ కాలేదని తెలిపారు. పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు స్పందిస్తూ,, శుక్రవారం పిటిషన్లపై విచారణ జరుపుతామన్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.