గ్లాండ్‌ ఫార్మా లాభం రూ.302 కోట్లు

ABN , First Publish Date - 2021-10-23T08:09:27+05:30 IST

కాంప్లెక్స్‌ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) అభివృద్ధిపై గ్లాండ్‌ ఫార్మా దృష్టి పెడుతోంది.

గ్లాండ్‌ ఫార్మా  లాభం రూ.302 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కాంప్లెక్స్‌ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) అభివృద్ధిపై గ్లాండ్‌ ఫార్మా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కొత్త పరిశోధన కేంద్రాన్ని కంపెనీ ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు కాంప్లెక్స్‌ ఇంజెక్టబుల్స్‌ అనుమతి కోసం అమెరికాలో దరఖాస్తు చేయనుంది. కాగా సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి గాను కంపె నీ రూ.302 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.219 కోట్లు)తో పోల్చితే లా భం 38 ు పెరిగింది. ఆదాయం కూడా 30ు వృద్ధితో రూ.831.5 కోట్ల నుంచి రూ.1,080 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయంలో భారత్‌ మార్కెట్‌ వాటా 17ు ఉంది. సెప్టెంబరు త్రైమాసికంలో  కంపెనీ రూ.143 కోట్ల పెట్టుబడులు పెట్టింది. 

Updated Date - 2021-10-23T08:09:27+05:30 IST