అదానీ విల్మార్‌ ఐపీఓ సైజు తగ్గింపు

ABN , First Publish Date - 2022-01-15T08:38:34+05:30 IST

వంటనూనెల కంపెనీ అదానీ విల్మార్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) సైజును రూ.4,500 కోట్ల నుంచి రూ.3,600 కోట్లకు

అదానీ విల్మార్‌ ఐపీఓ సైజు తగ్గింపు

వంటనూనెల కంపెనీ అదానీ విల్మార్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) సైజును రూ.4,500 కోట్ల నుంచి రూ.3,600 కోట్లకు తగ్గించుకుంది. కంపెనీ ఈ నెలలోనే ఐపీఓను ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదానీ గ్రూప్‌, సింగపూర్‌కు చెందిన విల్మార్‌ గ్రూప్‌ సంయు క్త భాగస్వామ్యంలో ఏర్పాటైన ఈ కంపెనీ ఫార్చూన్‌ పేరుతో వంటనూనె ఉత్పత్తులను విక్రయిస్తోంది. 


ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్‌ ఐపీఓ ధర శ్రేణి రూ.166-175

చెల్లింపుల సేవల కంపెనీ ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఐపీఓలో విక్రయించనున్న ఒక్కో షేరు ధర శ్రేణిని కంపెనీ రూ.166-175గా నిర్ణయించింది. 

Updated Date - 2022-01-15T08:38:34+05:30 IST