17 నుంచి యూఎస్‌ వీసాల జారీ

ABN , First Publish Date - 2020-08-15T10:20:55+05:30 IST

ఈ నెల 17 నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులకు వీసాలను ఇవ్వాలని యూఎస్‌ రాయభార కార్యాలయం ..

17 నుంచి యూఎస్‌ వీసాల జారీ

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):ఈ నెల 17 నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులకు వీసాలను ఇవ్వాలని యూఎస్‌ రాయభార కార్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కత్తలోని యూఎస్‌ వీసా కార్యాలయాలు ఈ నెల 17 నుంచి పరిమిత స్థాయిలో పనిచేయనున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు, ఇతర అత్యవసర  విజిటర్లకు వీసాలను జారీ చేయడం కోసం వీటిని తెరుస్తున్నారు. ఆన్‌లైన్‌లో వీసా స్లాట్‌లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.  

Updated Date - 2020-08-15T10:20:55+05:30 IST