సకాలంలో సిలబస్ పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-02-24T05:04:07+05:30 IST
విద్యాసంవత్సరం ముగిసేందుకు మరికొద్ది రోజులే వ్యవధే ఉండగా సిలబస్ను సకాలంలో పూర్తి చేయాలని ఐటీడీఏ పాజెక్టు అధికారి గౌతమ్ ఉపాధ్యాయులను ఆదేశించారు.
ఐటీడీఏ పీవో గౌతమ్.. దమ్మపేట, అశ్వారావుపేటలో విస్తృత పర్యటన
దమ్మపేట, ఫిబ్రవరి 23: విద్యాసంవత్సరం ముగిసేందుకు మరికొద్ది రోజులే వ్యవధే ఉండగా సిలబస్ను సకాలంలో పూర్తి చేయాలని ఐటీడీఏ పాజెక్టు అధికారి గౌతమ్ ఉపాధ్యాయులను ఆదేశించారు. మండల పరిధిలోని అంకంపాలెం, పార్కలగండి, దుర్గం గొల్లగూడెం, చీపురుగూడెం పాఠశాలలను ఆకస్మికంగా పీవో గౌతమ్ మంగళవారం సందర్శించారు. గొల్లగూడెం పాఠశాలలో విద్యార్థులకు గణితం బోధించారు. ఉపాధ్యాయుల బోదన విధానాన్ని పరీశీలించారు. అన్ని పాఠశాలల ఆవరణలను పరీశీలించారు.
మండలంలో ఐటీడీఏ పీవో పర్యటన
అశ్వారావుపేట రూరల్, ఫిబ్రవరి 23: మండలంలో మంగళవారం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు పర్యటించారు. మండలంలోని భీమునిగూడెం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని సౌకర్యాలను పరిశీలించారు. బోధన తీరును పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చూశారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం అశ్వారావుపేటలోని సా మాజిక వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని సౌకర్యాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట దమ్మపేట ఏటీడీవో చంద్రమోహన్ ఉన్నారు.