టెస్టు సిరీస్ నుంచి జడేజా ఔట్!
ABN , First Publish Date - 2021-01-12T04:49:12+05:30 IST
బొటన వేలి గాయంతో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. బ్రిస్బేన్లో జనవరి 15 నుంచి జరగబోయే నాలుగో టెస్టులో జడేజా ఆడడం లేదని సమాచారం.
సిడ్నీ: బొటన వేలి గాయంతో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. బ్రిస్బేన్లో జనవరి 15 నుంచి జరగబోయే నాలుగో టెస్టులో జడేజా ఆడడం లేదని సమాచారం. గబ్బాలో జరిగే ఈ టెస్టు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్టు. సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో మూడో రోజు ఆట సందర్భంగా జడేజాకు గాయమైంది. బొటనవేలు ఎముక పక్కకు జరగడంతో అతను మ్యాచ్ మిగతా రెండు రోజులూ బెంచికే పరిమితం అయ్యాడు. ఇప్పుడు నాలుగో టెస్టులో అతను ఆడటం అసాధ్యమని టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది.