ప్రతిసారీ ప్రజలు పీకేని, జగన్‌ను నమ్మరు: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2021-11-04T01:08:18+05:30 IST

ప్రజల నుంచి దోచుకుంటున్న సొమ్ముతోను, అప్పుల ద్వారా సమకూర్చుకుంటున్న ధనంతోను వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకోవాలని

ప్రతిసారీ ప్రజలు పీకేని, జగన్‌ను నమ్మరు: బుద్దా వెంకన్న

విజయవాడ: ప్రజల నుంచి దోచుకుంటున్న సొమ్ముతోను, అప్పుల ద్వారా సమకూర్చుకుంటున్న ధనంతోను వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకోవాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి, పీకే ప్రణాళికలు వేసుకుంటున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి అనే నరకాసురుడిని ప్రజలు ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు ప్రతిసారీ పీకేని, జగన్‌నే నమ్మరని చెప్పారు. అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు ఆటంకం కలిగినా, రైతులకు ఏదైనా జరిగినా అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే బాధ్యుడవుతాడని బుద్దా వెంకన్న హెచ్చరించారు. 

Updated Date - 2021-11-04T01:08:18+05:30 IST