జగన్‌ అక్రమాస్తుల కేసు వాయిదా

ABN , First Publish Date - 2021-10-23T08:10:53+05:30 IST

వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసును శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్‌ కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి, సబితాఇంద్రారెడ్డి తదితర

జగన్‌ అక్రమాస్తుల కేసు వాయిదా

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసును శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్‌ కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి, సబితాఇంద్రారెడ్డి తదితర నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జి పిటిషన్లకు సీబీఐ కౌంటరు పిటిషన్‌ కోర్టుకు ఇంకా సమర్పించలేదు. కౌంటరు దాఖలు తమకు సమయం కావాలని కోర్టులో సీబీఐ స్పష్టం చేసింది. దాంతోపాటు, సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదన్‌రావు శుక్రవారం సగం దినం సెలవులో ఉండటంతో కేసు విచారణను 28కు  వాయిదా వేస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2021-10-23T08:10:53+05:30 IST