జగన్ పూటకో మాట మారుస్తున్నారు: ధూళిపాళ్ల

ABN , First Publish Date - 2021-10-22T21:37:11+05:30 IST

సీఎం పూటకో మాట, నిమిషానికో వేషం మారుస్తున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. టీడీపీ కార్యాలయాలు

జగన్ పూటకో మాట మారుస్తున్నారు: ధూళిపాళ్ల

అమరావతి: సీఎం పూటకో మాట, నిమిషానికో వేషం మారుస్తున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల మాట్లాడుతూ వైసీపీ అరాచకానికి సజీవ సాక్ష్యం టీడీపీ కార్యాలయంపై దాడి అని చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ సభను రాజకీయ వేదికగా మార్చారని ధూళిపాళ్ల తప్పుబట్టారు. 


ఏపీలో తొత్తు లాంటి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను పెట్టుకుని అధికారం చెలాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. స్థానిక ఎన్నికలకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ముచ్చెమటలు పట్టిస్తామని హెచ్చరించారు. ‘‘మీకే కాదు... ఈ దేశంలో గాడ్సేకూ ఫ్యాన్స్ ఉన్నారు. ఉప్పు, కారం మేమూ తింటున్నాం. బీపీ మాకూ వస్తుంది’’ అని చింతమనేని హెచ్చరించారు. ఆర్థిక ఉగ్రవాదులతో ఏపీలో పాలన సాగుతోందని టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారం కావద్దనే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని నన్నూరి నర్సిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-22T21:37:11+05:30 IST