గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-08-10T20:31:41+05:30 IST
అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. సామాజిక తనిఖీ మార్గదర్శకాలను జగన్ విడుదల చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పీఎంయూ కాల్ సెంటర్ను జగన్ ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, గ్రామ, వార్డు సచివాలయాల ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.