కేసుల జాప్యానికి జగన్‌ గేమ్‌ప్లాన్‌!

ABN , First Publish Date - 2021-12-07T07:16:01+05:30 IST

అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కోర్టుకు హాజరుకాకుండా సీఎం జగన్‌కి వ్యక్తిగ త మినహాయింపు ఇవ్వొద్దని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది....

కేసుల జాప్యానికి జగన్‌ గేమ్‌ప్లాన్‌!

 కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దు

 తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదన 

 వారంలో ఐదు రోజులపాటు

 సీఎం కోర్టుకు రావడం సాధ్యమా?

 జగన్‌ న్యాయవాదుల వెల్లడి.. తీర్పు రిజర్వ్‌ 


హైదరాబాద్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కోర్టుకు హాజరుకాకుండా సీఎం జగన్‌కి వ్యక్తిగ త మినహాయింపు ఇవ్వొద్దని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. కేసును ఆలస్యం చేయడానికి జగన్‌ ఆడుతు న్న గేమ్‌ప్లాన్‌లో భాగంగానే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నారని పేర్కొంది. క్విడ్‌ ప్రొ కో కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయిం పు ఇవ్వాలని కోరుతూ ఈ కేసుల్లో ఏ-1 నిందితుడిగా ఉన్న జగన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణను కొనసాగించింది. సీబీఐ న్యా యవాది సురేందర్‌ వాదనలు వినిపించారు. ‘దిగువ కోర్టులో విచారణను ఆలస్యం చేయడానికే ఇలా చేస్తున్నారు. ఇదంతా గేమ్‌ ప్లాన్‌. సీబీఐ కేసులు నమోదై పదేళ్లవుతోంది. ఇంకా డి శ్చార్జ్‌ పిటిషన్ల దశ కూడా దాటలేదు. నిందితులు ఉద్దేశపూర్వకంగా ఒకరి తర్వాత మరొకరు పిటిషన్లు వేస్తున్నారు. అభియోగాల నమోదయ్యాక హాజరు నుంచి మినహాయింపు తీసుకోవడం వేరు. అభియోగాలకు ముందే మినహాయింపు ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదు’ అని స్పష్టం చేశారు. వ్యక్తిగత మినహాయింపుపై గతంలో పిటిషనర్‌ దాఖలు చేసిన పిటిషన్లను దిగువ కోర్టు, ఇదే హైకోర్టు కొట్టేశాయని గుర్తుచేశారు. ప్రస్తుతం పిటిషనర్‌ ఇంకా పెద్ద హోదాలో ఉన్నారని..


ఇప్పు డు ఇంకా ఎక్కువగా సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందని తెలిపారు. వ్యక్తిగత మినహాయింపుపై ఇప్పటికే తీర్పు ఇచ్చినందున మళ్లీ దానిని సమీక్షించాల్సిన అవసరం లేదని చెప్పారు. వివిధ కారణాలతో హాజరు నుంచి మినహాయింపు అడిగిన ప్రతిసారీ దిగువ కోర్టు మంజూరు చేసిందన్నారు. ఒక్కసారి అభియోగాలు నమోదు చేయడం పూర్తయి తే ఒక ఏడాది లోపు ట్రయల్‌ పూర్తి కావలసి ఉంటుందని తె లిపారు. కేసులు నమోదై పదేళ్లు అవుతోందని.. ఇప్పటికు చా లా ఆలస్యం జరిగిందన్నారు. జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీబీఐ కోర్టులో గానీ, హైకోర్టులోగానీ తామెప్పుడూ వాయిదాలు తీసుకోలేద ని.. ఆలస్యానికి తాము కారణం కాదన్నారు. సీబీఐ కేసులను ముందుగా విచారించాలా.. లేక ఈడీ కేసులనా అన్న అం శంపై విచారణ జరిగిందని తెలిపారు. అప్పట్లో పిటిషనర్‌ ఎంపీగా ఉన్నారని, హైదరాబాద్‌లోనే నివాసం ఉన్నారు కాబ ట్టి.. వారంలో ఒక్క రోజు కోర్టుకు వస్తే ఇబ్బందేమీ లేదని గతంలో కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.


పిటిషనర్‌ ఇప్పుడు ఆంధ్ర సీఎం అయ్యారని.. అక్కడే నివాసం ఉంటున్నారని తెలిపారు. పరిస్థితులు మారినందున వ్యక్తిగతంగా మినహాయిపు ఇచ్చే అంశంపై తాజాగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ‘గతంలో క్విడ్‌ ప్రొకో కేసులపై సీబీఐ కోర్టులో వారంలో ఒకరోజు విచారణ జరిగేది. ఇప్పుడు వారంలో ఐదు రోజులు జరుగుతోంది. ఒక ముఖ్యమంత్రి వారంలో ఐదు రోజులు కోర్టుకు హాజరుకాలేరు. పాలన వ్యవహారాలు గాడి తప్పుతాయి. ప్రత్యక్ష హాజరు తప్పనిసరి అనుకున్నప్పుడు పిటిషనర్‌ హాజరవుతారు. అభియోగాలకు ముందు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వరాదని ఎక్కడా లేదు. ఈ అంశం కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది.


దాల్మియా సిమెంట్స్‌ కేసులో వాదనలు

దాల్మియా సిమెంట్స్‌కు మైనింగ్‌ లీజు వ్యవహారరంలో ఆ సంస్థ ఎండీ పునీత్‌ దాల్మియా దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. చట్టబద్ధంగా తమకు మైనింగ్‌ లీజు కేటాయించారని.. అలాంటప్పుడు క్విడ్‌ప్రోకో ఆరోపణలకు ఆస్కారమే లేదని దాల్మియా తరఫున సీనియర్‌ న్యాయవాది పీవీ కపూర్‌  స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-07T07:16:01+05:30 IST