జగ్గయ్యపేటలో ఏకపక్షంగా వ్యహరిస్తున్న ఎన్నికల అధికారులు
ABN , First Publish Date - 2021-11-06T21:19:51+05:30 IST
జగ్గయ్యపేటలో ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యహరిస్తున్నారు. నామినేషన్ల పరిశీలనలో ఎన్నికల సిబ్బంది ఏకపక్ష నిర్ణయాలు
కృష్ణా: జగ్గయ్యపేటలో ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యహరిస్తున్నారు. నామినేషన్ల పరిశీలనలో ఎన్నికల సిబ్బంది ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నామినేషన్ పత్రాల వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. అధికార పార్టీ అభ్యర్థుల నామినేషన్లలో తప్పుల్ని స్వయంగా ఎన్నికల అధికారులు సరిదిద్దుతున్నారు. విపక్ష సభ్యుల నామినేషన్ల పరిశీలనలో ఏమీ పట్టనట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల అధికారుల తీరుని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.