కాంగ్రెస్ అధిష్ఠానానికి జగ్గారెడ్డి లేఖ
ABN , First Publish Date - 2021-12-28T01:46:50+05:30 IST
సోనియా, రాహుల్గాంధీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం లేఖ రాశారు.టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై జగ్గారెడ్డి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: సోనియా, రాహుల్గాంధీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం లేఖ రాశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై జగ్గారెడ్డి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్ పదవీ నుంచి రేవంత్రెడ్డిని మార్చాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. అందరినీ కలుపుకుని పనిచేసేవారిని పీసీసీ చీఫ్ పదవీకి నియమించాలని జగ్గారెడ్డి అధిష్ఠానానికి కోరారు. లేదంటే రేవంత్ని పార్టీ డైరెక్షన్లో పనిచేసేలా చూడాలన్నారు. రేవంత్రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసమే పనిచేస్తున్నారన్నారు. పార్టీ నేతలతో చర్చించకుండానే కార్యక్రమాలు ప్రకటిస్తున్నారని చెప్పారు. ఈ విషయం పార్టీలో చాలా ఇబ్బందిగా ఉందన్నారు. తెలంగాణలో కార్పొరేట్ తరహాలో కాంగ్రెస్ నడుస్తోందన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో ఏదో కుట్ర జరుగుతోందని చెప్పారు. ఈ విషయంపై అధిష్ఠానం విచారణ జరిపించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడాలనే ఫిర్యాదు చేస్తున్నానన్నారు. రేవంత్కి, తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని జగ్గారెడ్డి లేఖలో తెలిపారు.