జగ్గయ్యపేట చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ..

ABN , First Publish Date - 2021-05-05T16:55:12+05:30 IST

అమరావతి: నేటి నుంచి ఈ నెల 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం

జగ్గయ్యపేట చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ..

అమరావతి: నేటి నుంచి ఈ నెల 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల‌ వరకే వ్యాపారాలు, రవాణాకు అనుమతి లభించనుంది. 12 తర్వాత అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసర సర్వీసులకు మాత్రమే 12 తర్వాత అనుమతి లభించనుంది. జగ్గయ్యపేట చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయాలని.. సరైన కారణం ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. లేదంటే వెనక్కి పంపించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత రాష్ట్ర సరిహద్దులను మూసివేయనున్నారు.

Updated Date - 2021-05-05T16:55:12+05:30 IST