డ్రంకెన్ డ్రైవ్ కేసులో నిందితుడికి జైలు
ABN , First Publish Date - 2021-03-02T05:14:45+05:30 IST
డ్రంకెన్ డ్రైవ్ కేసులో నిందితుడికి జైలు
ధారూరు : మద్యం తాగి వాహనం నడిపిన కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. ఫిబ్రవరి 26న ధారూరులో నిర్వహించిన డ్రంకెన్డ్రైవ్లో యాలాల మండలం, రాస్నం గ్రామానికి చెందిన వెంకటయ్య మద్యం తాగి వాహనం నడుపుతుండగా కేసు నమోదు చేశారు. సోమవారం వికారాబాద్ జేఎ్ఫసీఎం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి మహేందర్ కేసును విచారించాడు. నిందితుడికి మూడు రోజుల జైలు శిక్షతో పాటు, రూ. 2వేల జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు.