ఎమ్మెల్యే జోగి రమేష్తో ప్రాణహాని.. రక్షించే బాధ్యత జగన్దే: లీలావతి
ABN , First Publish Date - 2021-12-14T00:26:23+05:30 IST
పెడన ఎమ్మెల్యే జోగి రమేష్తో ప్రాణహాని ఉందని వైసీపీ నాయకురాలు జక్కా లీలావతి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రెస్ మీట్ నిర్వహించిన..
ఏలూరు: పెడన ఎమ్మెల్యే జోగి రమేష్తో ప్రాణహాని ఉందని వైసీపీ నాయకురాలు జక్కా లీలావతి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె తన భర్త ప్రదీప్ కుమార్ కృష్ణా జిల్లా కృత్రివిన్ మండలం పడతడిక సర్పంచ్గా ఉన్నారని, గతంలో తమపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు మత్తుమందు ఇచ్చి జోగి రమేష్ తన వైపు తిప్పుకున్నాడని లీలావతి ఆరోపించారు. తమను చంపేస్తామని జోగి రమేష్ బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షించే బాధ్యత జగన్దేనని లీలావతి మొరపెట్టుకున్నారు.