ప్రభుత్వానిది పైశాచిక ఆనందం: నాదెండ్ల
ABN , First Publish Date - 2021-12-03T02:16:20+05:30 IST
వన్ టైమ్ సెటిల్మెంట్ కట్టని పక్షంలో పెన్షన్ కట్ చేస్తామంటూ
గుంటూరు: వన్ టైమ్ సెటిల్మెంట్ కట్టని పక్షంలో పెన్షన్ కట్ చేస్తామంటూ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో ప్రజలను వేధిస్తున్నారన్నారు. వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. తుఫాన్ల వల్ల రైతులు తీవ్రంగా పంట నష్టపోయారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. రాష్ట్రంలో పాలన ఎక్కడా కనిపించడం లేదన్నారు.