ఏప్రిల్ 3న తిరుపతిలో జనసేనాని పర్యటన
ABN , First Publish Date - 2021-03-31T00:14:45+05:30 IST
ఏప్రిల్ 3న జనసేన అధినేత పవన్కల్యాణ్ తిరుపతిలో పర్యటిస్తారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
తిరుపతి: ఏప్రిల్ 3వ తేదీన జనసేన అధినేత పవన్కల్యాణ్ తిరుపతిలో పర్యటిస్తారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడీ వరకు పవన్కల్యాణ్ పాదయాత్ర ఉంటుందని చెప్పారు. పాదయాత్ర తర్వాత పవన్ బహిరంగ సభలో మాట్లాడతారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ రెండో విడత పర్యటన నెల్లూరు జిల్లాలో ఉంటుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.