పీపీఈలపై జవహర్‌రెడ్డి సమీక్ష సమావేశం

ABN , First Publish Date - 2020-04-02T20:23:03+05:30 IST

అమరావతి: పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) లపై వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు

పీపీఈలపై జవహర్‌రెడ్డి సమీక్ష సమావేశం

అమరావతి: పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్  (పీపీఈ) లపై వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్  సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లా ఆసుపత్రికీ వెయ్యి పీపీఈలు సరఫరా చేయాలని ఆయన కోరారు. నాలుగు స్టేట్ కోవిడ్ ఆసుపత్రులకు ప్రతి రోజూ 2500 పీపీఈలు సరఫరా చేయాలని సూచించారు. పీపీఈలకు కావాల్సిన 90 జీఎస్‌ఎం నాన్ వోవెన్ ఫ్యాబ్రిక్ సప్లయర్స్‌తో మాట్లాడామన్నారు. గురువారం కొన్ని శాంపిళ్లను  పరిశీలించామని జవహర్ రెడ్డి తెలిపారు. పీపీఈల విషయంలో అన్ని చర్యల్నీ రాష్ట్ర ప్రభుత్వం  తీసుకుంటోందని జవహర్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-04-02T20:23:03+05:30 IST