జగన్ ఆయన మాట మాత్రమే భయంతో వింటారు : జేసీ

ABN , First Publish Date - 2020-06-01T17:32:37+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....

జగన్ ఆయన మాట మాత్రమే భయంతో వింటారు : జేసీ

అనంతపురం : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ నియంతలా పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. జగన్ ఎవరి మాటలు వినరు. ఆయన వింటే ప్రధాని నరేంద్ర మోదీ మాట మాత్రమే వింటారు. ఎందుకంటే ఆయన ఏమైనా జగన్‌‌ను చేస్తాడేమో అనే భయంతో వింటారు. 151 మంది మెజార్టీ ఉందని అహంతో ఉండటం కరెక్టు కాదు. నాకు రాజ్యాంగం లేదు.. నేను చెప్పిందే జరగాలి అనే ధోరణి కనిపిస్తోంది. నేనే రాజు నేనే మంత్రి చట్టం లేదు నీతి లేదు అన్నట్లుగా ముఖ్యమంత్రి తీరు ఉంది అని జేసీ విమర్శలు గుప్పించారు.


ముఖ్యమంత్రి పోలేకపోతే..

రాజకీయాల్లో నాటికి నేటికి చాలా మార్పులు వచ్చాయి. బస్సుల జాతీయం చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికి న్యాయస్థానం సలహా ఇచ్చినా వెంటనే రాజీనామా చేశారు. 151 మంది మెజార్టీ వచ్చినా రాజ్యాంగ బద్దంగా రాష్ట్రాన్ని పరిపాలించాలి. నేనే రాజు నేను తప్ప ఎవ్వడు లేడు అనే పద్దతి ఉంది. రాష్ట్ర ప్రజలు ఏమి మాట్లాడుకుంటున్నారో ముఖ్యమంత్రి చూడాలి. ప్రజలను కన్వెన్స్ చేయాలి. అమరావతి రాజధాని కోసం అన్ని రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి పోలేకపోతే ఆయన సన్నిహితులు వెళ్లాలి. జగన్ పాలన చదువుకున్న వాళ్లకు అర్థం అయ్యింది. ఇంకా కాయా కష్టం చేసుకున్న వాళ్లకు ఇంకా అర్థం కాలేదుఅని మాజీ ఎంపీ జేసీ విమర్శల వర్షం కురిపించారు

.

///////////

Updated Date - 2020-06-01T17:32:37+05:30 IST