రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి
ABN , First Publish Date - 2020-10-22T09:46:53+05:30 IST
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం వైద్యం, అక్టోబరు 21: ‘‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. తప్పు చేయకపోయినా కేసులు పెట్టి లోపల వేస్తున్నారు. ఇక్కడ బతకనీయకపోతే మరో చోటుకెళ్తాం. ఏపీలో వైసీపీ ఇష్టారాజ్యంగా చేస్తోంది. హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది’’ అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. బుధవారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాహన కొనుగోళ్లు అక్రమమైతే అమ్మిన అశోక్ లేలాండ్ ప్రతినిధులను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. తన పేరు మీద వాహనాలు లేకపోయినా.. ఎలా కేసులు పెడతారన్నారు. ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి ఇలా లేదన్నారు.