ఏపీ పోలీసులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-01-20T21:18:49+05:30 IST

పోలీస్‌ అసోసియేషన్ ఎన్ని రోజులు సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో ఉంటారని

ఏపీ పోలీసులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

అనంతపురం: పోలీస్‌ అసోసియేషన్ ఎన్ని రోజులు సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో ఉంటారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని ఉద్దేశించి జేసీ ప్రభాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా భార్య సోదరుడు ప్రసన్నకుమార్‌రెడ్డి.. 3 సార్లు ఎస్పీని దూషిస్తే కేసుల్లేవు. నాకే బాధేస్తుంది. నేను ఏమీ మాట్లాడకపోయినా కడప జైలు నుంచి వస్తుంటే.. నేను ఏదో అన్నానని పోలీసు అసోసియేషన్ అంటోంది. కేసులు పెట్టి మళ్లీ జైలుకు పంపించారు. ఇంత దారుణంగా పోలీస్ పరిస్థితి ఉంది. నాకో న్యాయం?... నా బావమరిదికో న్యాయమా?. జెండా ఒక్కటే డిఫరెన్స్. నాది పచ్చది.. వాళ్ళది బ్లూ కలర్’ అని వ్యాఖ్యానించారు.


‘అసోసియేషన్ ఎవరో కాదు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్ని రోజులు సజ్జల చేతుల్లో ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా ఐఏఎస్ ఆఫీసరా? సాక్షి పేపర్‌లో కథలు రాసుకునే వాడు. కథలు రాసేవాడు పోలీసులను ఆదేశిస్తే.. మీరెందుకు ఐఏఎస్, ఐపీఎస్ అవసరమా? ఎందుకు కష్టపడి చదివి శిక్షణ తీసుకున్నారు. మీ పరిస్థితి దారుణంగా ఉంది మారండి. మీరెవ్వరు మా ఇంట్లోకి రావడానికి.. మా ఇంట్లోకి వచ్చి మాపై కేసులు పెడతారా? పోలీసు అసోసియేషన్ ఒక్కొక్కరికి ఒక్కో రూలా?’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలీస్ వ్యవస్థను నిలదీశారు.



Updated Date - 2021-01-20T21:18:49+05:30 IST