చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్గా జితేంద్ర
ABN , First Publish Date - 2021-04-21T09:50:20+05:30 IST
రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్గా పి. జితేంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్గా పి. జితేంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జితేంద్ర ప్రస్తుతం విశాఖపట్నంలో డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. అదనపు బాధ్యతల్లో ఆయన డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీగా కూడా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఈ పదవిలో అదనపు బాధ్యతల్లో విజయలక్ష్మి ఉన్నారు.