‘బీజేపీ మినహా అన్ని పార్టీలు ప్రత్యేకహోదా అన్నాయి’
ABN , First Publish Date - 2020-05-29T01:47:28+05:30 IST
గత ఎన్నికల్లో బీజేపీ మినహా అన్ని పార్టీలు ప్రత్యేకహోదా అన్నాయని కాంగ్రెస్ నేత జీవీరెడ్డి గుర్తుచేశారు.
అమరావతి: గత ఎన్నికల్లో బీజేపీ మినహా అన్ని పార్టీలు ప్రత్యేకహోదా అన్నాయని కాంగ్రెస్ నేత జీవీరెడ్డి గుర్తుచేశారు. ప్రత్యేకహోదా అని జాతీయ, రాష్ట్ర స్థాయిలో బీజేపీ ఎప్పుడూ అనలేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా ఏపీ ప్రజల హక్కు అన్నారు. బీజేపీకి క్లియర్ మెజార్టీ ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.