వారాంతంలో కొనుగోళ్ల జోష్
ABN , First Publish Date - 2020-09-26T06:36:11+05:30 IST
ప్రపంచ మార్కెట్లో ట్రేడింగ్ సెంటిమెంట్ మెరుగవడంతో దలాల్స్ట్రీట్ వర్గాలు భారీగా కొనుగోళ్లకు పాల్పడ్డాయి. రూపాయి బలపడటమూ స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది...
సెన్సెక్స్ 835 పాయింట్లు పైకి.. 6 రోజుల వరుస నష్టాలకు తెర
రూ.3.5 లక్షల కోట్లు పెరిగిన సంపద
ముంబై: ప్రపంచ మార్కెట్లో ట్రేడింగ్ సెంటిమెంట్ మెరుగవడంతో దలాల్స్ట్రీట్ వర్గాలు భారీగా కొనుగోళ్లకు పాల్పడ్డాయి. రూపాయి బలపడటమూ స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది. దాంతో ఈక్విటీ సూచీల ఆరు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. వారాంతం ట్రేడింగ్ ముగిసేసరికి బీఎ్సఈ సెన్సెక్స్ ఏకంగా 835.06 పాయింట్లు పెరిగి 37,388.66 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 244.70 పాయింట్లు లాభపడి 11,050.25 వద్ద ముగిసింది. ప్రధాన కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి షేర్ల కొనుగోలుకు ట్రేడర్లు ఎగబడ్డారు. దాంతో బీఎ్సఈ స్మాల్క్యాప్ సూచీ 2.31 శాతం, మిడ్క్యాప్ ఇండెక్స్ 2.90 శాతం పెరిగాయి. తత్ఫలితంగా బీఎ్సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.52 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.152,28,237 కోట్లకు చేరుకుంది. బజాజ్ ఫిన్సర్వ్ 6.85 శాతం పెరుగుదలతో టాప్ గెయినర్గా నిలిచింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ 5 శాతం పుంజుకోగా.. ఎయిర్టెల్, ఇండ్సఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ 4 శాతం పైగా బలపడ్డాయి. బీఎ్సఈలోని అన్ని రంగ సూచీలు పుంజుకున్నాయి. టెలికాం సూచీ 5.73 శాతం ఎగబాకింది. టెక్నాలజీ 4 శాతం, ఐటీ 3.63 శాతం పెరిగాయి.