‘క్రాఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఎంపిక చేయడం సరికాదు’

ABN , First Publish Date - 2020-12-04T00:20:30+05:30 IST

‘క్రాఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఎంపిక చేయడం సరికాదు’

‘క్రాఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఎంపిక చేయడం సరికాదు’

అనంతపురం: అకాల వర్షాల వల్ల అనంత రైతులు తీవ్రంగా నష్టపోయినా ముఖ్యమంత్రి జగన్ దృష్టికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒక్కరూ తీసుకెళ్ల లేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. అప్పుల బాధతో అల్లాడుతున్న జిల్లా రైతులకు సాయం చేయాల్సిన చేతులే కర్కశంగా వారి గొంతులు నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 సంవత్సరానికి సంబంధించి దాదాపు 5.60 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. సెప్టెంబరు,  అక్టోబరు నెలల్లో వచ్చిన అధిక వర్షాల వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల రైతులు అకాల వర్షాల వల్ల నష్టపోతే కేవలం 33 మండలాల్లో నే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారని చెప్పారు.  క్రాఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఎంపిక చేయడం సరికాదన్నారు.

Updated Date - 2020-12-04T00:20:30+05:30 IST