జగన్ ఏడాది పాలనలో కనిపించింది ఇదే: కన్నా
ABN , First Publish Date - 2020-06-01T17:14:29+05:30 IST
సీఎం జగన్ అవగాహనారాహిత్యంతో పాలన సాగిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. సీఎం జగన్ అసలు రంగు
అమరావతి: సీఎం జగన్ అవగాహనారాహిత్యంతో పాలన సాగిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. సీఎం జగన్ అసలు రంగు బయటపడిందని చెప్పారు. అప్రజాస్వామ్యం, అవినీతి, అనుభవరాహిత్యం, కక్ష సాధింపులు, అసమర్థత, అప్పులే ప్రాధాన్యంగా జగన్ ఏడాది పాలన సాగిందని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో అవినీతిని తేల్చలేని అసమర్థత కనబడుతోందని ధ్వజమెత్తారు. జగన్ మూడు రాజధానుల చుట్టూ రాజకీయం చేస్తున్నారని కన్నా వ్యాఖ్యానించారు.