అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు: కన్నా

ABN , First Publish Date - 2020-08-11T17:53:45+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తన వంతు తీవ్రంగా కృషి చేశానని..

అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు: కన్నా

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తన వంతు తీవ్రంగా కృషి చేశానని బీజేపీనేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం ఏపీ బీజేపీ అధ్యక్షునిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కన్నా మాట్లాడుతూ తాను అధ్యక్షునిగా ఉన్నప్పుడు తనకు సహకరించిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తన చర్యల వల్ల కొందరికి కష్టం, నష్టం కలిగించినా..అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు. కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజుకు సహకారం అందిస్తానని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

Updated Date - 2020-08-11T17:53:45+05:30 IST