త్వరలోనే ఆహార శుద్ధిపాలసీని ప్రకటిస్తాం: మంత్రి కన్నబాబు
ABN , First Publish Date - 2020-09-24T19:19:33+05:30 IST
త్వరలోనే ఆహార శుద్ధిపాలసీని ప్రకటిస్తాం: మంత్రి కన్నబాబు
అమరావతి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కన్నబాబు అన్నారు. ఆయిల్ఫాం ధరల్లో తెలంగాణతో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు రూ.80 కోట్లు కేటాయించామని చెప్పారు. పెదవేగి ఫ్యాక్టరీకి పంటను తరలించే రైతులకు ఆయిల్ఫామ్ పంటకు టన్నుకు రూ.11 వేలు ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఆయిల్ఫాంకు మద్దతు ధర చెల్లించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. త్వరలోనే ఆహార శుద్ధిపాలసీని ప్రకటిస్తామని మంత్రి చెప్పారు. వ్యవసయ, అనుబంధరంగాలను ఫుడ్ప్రాసెసింగ్ పరిధిలోకి తెస్తామన్నారు.