ఆసీస్ సిరీస్ నుంచి సెలవు తీసుకున్న కోహ్లీ.. కపిల్ దేవ్ కామెంట్స్!

ABN , First Publish Date - 2020-11-22T18:46:37+05:30 IST

టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తండ్రి అవ్వబోతున్నాడు. దీనికోసం ఆస్ట్రేలియా సిరీస్‌లో కొన్ని మ్యాచులకు దూరం అవుతున్నాడు.

ఆసీస్ సిరీస్ నుంచి సెలవు తీసుకున్న కోహ్లీ.. కపిల్ దేవ్ కామెంట్స్!

ముంబై: టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తండ్రి అవ్వబోతున్నాడు. దీనికోసం ఆస్ట్రేలియా సిరీస్‌లో కొన్ని మ్యాచులకు దూరం అవుతున్నాడు. డెలివరీ సమయంలో కుటుంబంతో ఉండాలనే ఉద్దేశ్యంతోనే కోహ్లీ పేటెర్నిటీ లీవ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయంపై భారత మాజీ కెప్టెన్, 1983 ప్రపంచకప్ గెలిచిన సారధి కపిల్ దేవ్ స్పందించారు. తమ హయాంలో ఇలా పేటెర్నిటీ లీవ్ తీసుకునే సదుపాయం ఉండేది కాదని ఆయన చెప్పారు. సునీల్ గవాస్కర్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందని, కానీ అతను తన బిడ్డను కనీసం చూసుకోవడానికే కొన్ని నెలల సమయం పట్టిందని చెప్పాడు. అయితే కోహ్లీ నిర్ణయాన్ని కపిల్ తప్పుబట్టలేదు. ఇటువంటి సమయంలో కుటుంబంతో కలిసి ఉండాలనుకోవడం మంచి నిర్ణయమని, తాను కోహ్లీ చేసిన పనికి సంతోషిస్తున్నానని చెప్పాడు.

Updated Date - 2020-11-22T18:46:37+05:30 IST