ఏబీఎన్ పిటిషన్పై కపిల్ సిబల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-06-02T00:09:08+05:30 IST
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పిటిషన్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఛానెళ్లపై పెట్టిన రాజద్రోహం
హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పిటిషన్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఛానెళ్లపై పెట్టిన రాజద్రోహం కేసుపై జాతీయ పత్రికలు, ఛానెళ్లలో విస్తృతంగా చర్చిస్తున్నాయి. ఏబీఎన్ రిట్ పిటిషన్ న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీ సహా పలువురు న్యాయ కోవిదులు దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశద్రోహ చట్టం విషయంలో పత్రికా స్వేచ్ఛకు ప్రత్యేక దృష్టి అవసరమని సుప్రీం కోర్టు అంగీకరించిందని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. విద్యార్థులు, విద్యావేత్తలు మౌనం వీడాలని కపిల్ అన్నారు.